ఈసీ తీరుపై భగ్గుమన్న టీడీపీ

Update: 2019-05-16 09:39 GMT

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ భగ్గుమంది. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఏపీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. పోలింగ్‌ ముగిసిన నెల తర్వాత వైసీపీ ఫిర్యాదు చేస్తే ముందూ వెనుక ఆలోచించకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడమేంటని మండిపడ్డారు. ఆందోళన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నేతలు సబ్‌కలెక్టర్‌కు అందజేశారు. 

Similar News