టిక్కెట్ల విషయంలో తెలుగుదేశం పార్టీలో సమీకరణలు మారుతున్నాయి. అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా కొందరు నాయకులకు పక్క జిల్లాల్లో టిక్కెట్లను కేటాయిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి జవహర్కు కృష్ణా జిల్లా తిరువూరు స్థానాన్ని కేటాయించారు. అలాగే పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే అనితకు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు టిక్కెట్ను కేటాయించారు. ఇటు మిగతా మంత్రులు గంటా శ్రీనివాసరావు, సిద్దా రాఘవరావు, పరిటాల సునిత విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పొలిట్ బ్యూరో సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.