జగన్‌కు ఓటేస్తే...పసుపు కుంకుమ చెరిపేస్తారు... టీడీపీ నేత తీవ్ర ఆరోపణలు

Update: 2019-03-23 12:06 GMT

అవినీతి, హత్యారాజకీయాలకు చిరునామా జగన్ అని ఆరోపించారు టీడీపీ నేత రాజేంద్రప్రసాద్. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసిన చరిత్ర జగన్ దని విమర్శించారు. వైఎస్ అరాచకాలు చూడలేకనే పంచభూతాలు ఆయన్ని తీసుకు వెళ్లాయని విరుచుకుపడ్డారు. హత్యా రాజకీయాలు వైఎస్ కుటుంబంలోని మూడు తరాలకు ఉన్నాయని ఆరోపించారు. ఏపీలో ఎన్నో రాజకీయ కుటుంబాలు ఉన్నాయని ఏ కుటుంబంపై లేని హత్యారోపణలు మీ కుటుంబంపైనే ఎందుకున్నాయని ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే పసుపు-కుంకుమ ఇస్తారని, జగన్‌కు ఓటేస్తే పసుపు-కుంకుమ చెరిపేస్తారని అన్నారు.

Similar News