వైసీపీలోకి వలసల పరంపరం కొనసాగుతోంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు వైసీపీలో చేరనున్నారు. గతంలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన వరపుల సుబ్బారావు తిరిగి రెండు రోజుల్లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు. ఇదిలావుంటే కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన సతీమణి వాణి, సినీనటుడు రాజారవీంద్ర, విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు ఇవాళ వైసీపీలో చేరారు.