ఆ రోజు విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లడం ఖాయం: యామిని

Update: 2019-05-09 08:12 GMT

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ మహిళా నేత సాధినేని యామిని తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. నేడు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంరర్భంగా తాను మాట్లాడుతూ గాలికి సచివాలయంలో టెంట్ పడిపోయినా దానికి నానా రాద్దాత్తం చేస్తున్నారని మరి ఇదే విజయసాయిరెడ్డికి హుద్ హుద్ తుఫాన్‌ కనిపించలేదా? అని ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకం అమలు చూసి కేంద్రం అవార్డులే ఇచ్చిందన్నారు సాధినేని యామిని. కానీ నిధులు రాకుండా వైసీపీ ఆపాలని చూసిందని యామిని ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు వీసా రెడ్డిగా మార్చుకున్నారన్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాలు ఈనెల 23విడుదల కానున్నాయని ఆ ఫలితాలు చూసిన తరువాత విజయసాయిరెడ్డి విదేశాలకుఖాయమని సాధినేని యామిని జోస్యం చెప్పారు. 

Similar News