చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్పోర్టులో బుల్లెట్ల కలకలం సృష్టించాయి. తనిఖీల్లో భాగంగా ఎయిర్ పోర్టు సిబ్బంది, సాయినాథ్శర్మ అనే వ్యక్తి నుంచి 20 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయన కడప జిల్లా కమలాపురం సింగిల్ విండో ఛైర్మన్గా ఉన్నారు. సాయినాథ్శర్మను ఎయిర్పోర్టు అధికారులు, పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది. దీంతో ఆయనను విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సాయినాథ్ శర్మ లైసెన్స్డ్ గన్ను పోలీసులకు డిపాజిట్ చేయలేదని సమాచారం.