ఏపీలో కచ్చితంగా రాజకీయం చేస్తా : తలసాని

టీఆర్ఎస్ నాయకులు ఏపీలో పర్యటిస్తుంటే చంద్రబాబుకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.

Update: 2019-01-17 10:24 GMT

టీఆర్ఎస్ నాయకులు ఏపీలో పర్యటిస్తుంటే చంద్రబాబుకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. తనను కలసిన టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడంపై తలసాని ఘాటుగా స్పందించారు. తాను ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా పర్యటించాల్సి ఉందనీ అక్కడ తప్పకుండా రాజకీయ చేస్తానని చెప్పారు. చంద్రబాబు తెలంగాణలో రాజకీయం చేయగా తప్పుకానిది, తాము ఏపీలో రాజకీయం చేస్తే తప్పా అని తలసాని ప్రశ్నించారు. 

Similar News