ఏపీ కేబినెట్ పై అదే ఉత్కంఠ

Update: 2019-05-13 09:50 GMT

కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో కేబినెట్‌ భేటిపై సీఎం చంద్రబాబు సీఎస్‌తో చర్చించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమయిన సీఎస్‌‌ అరగంట పాటు చర్చించారు. రేపటి కేబినెట్ సమావేశంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. ఈసీ నుంచి ఇంత వరకు అనుమతి రాలేదని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తెలియజేశారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలో ఉన్నందున ఈ సాయంత్రం లేదా రేపు నిర్ణయం వచ్చే అవకాశముందన్నారు.

అయితే కేబినెట్ స్థానంలో సమీక్ష నిర్వహించాలని భావిస్తున్న చంద్రబాబు ఇదే విషయాన్ని సీఎస్‌కు చెప్పినట్టు సమాచారం. ఫోనీ తుపాను, కరువు, తాగునీటి సమస్యలపై చర్చించనున్నట్టు తెలయజేశారు. ఆయా శాఖల కార్యదర్శులు, సీఎస్ ఈ సమావేశంలో పాల్గొనాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రానికి ఈసీ నుంచి అనుమతి వస్తే కేబినెట్‌‌ ఎల్లుండి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Similar News