శబరిమలలో మళ్లీ కలకలం...అయ్యప్పని దర్శించుకున్న శ్రీలంక మహిళ..

శబరిమలలో మరోసారి కలకలం రేగింది. శ్రీలంకకు చెందిన 46 ఏళ్ల మహిళ శబరిమల ఆలయంలోకి ప్రవేశించింది. 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తుండగా ఆమె మాత్రం తాను వెళ్లలేదని చెబుతోంది.

Update: 2019-01-04 03:47 GMT
Sabarimala temple

శబరిమలలో మరోసారి కలకలం రేగింది. శ్రీలంకకు చెందిన 46 ఏళ్ల మహిళ శబరిమల ఆలయంలోకి ప్రవేశించింది. 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తుండగా ఆమె మాత్రం తాను వెళ్లలేదని చెబుతోంది.

శ్రీలంకకు చెందిన శశికళ గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. 18 మెట్లను ఎక్కి గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు చేశారని శబరిమల వర్గాలు చెబుతున్నాయి. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులతో కలిసి ఆమె అయ్యప్పను దర్శించుకొని అనంతరం ఎటువంటి గందరగోళం లేకుండా పంబకు చేరుకున్నట్టు సమాచారం.

అయితే, తాను స్వామిని దర్శించుకున్నట్టు వస్తున్న వార్తలను శశికళ ఖండించారు. తానో భక్తురాలినని, 48 రోజుల దీక్షలో ఉన్నానని పేర్కొన్నారు. తనను వెనక్కి పంపే అధికారం ఎవరికీ లేదన్నారు. వివిధ కారణాల వల్ల తన గర్భసంచిని తొలగించారని, కాబట్టి అయ్యప్పను దర్శించుకునే హక్కు తనకు ఉందని శశికళ చెబుతోంది. అందుకు సంబంధించిన వైద్య ధ్రువీకరణ పత్రం కూడా తన వద్ద ఉందన్నారు. 

Similar News