ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మాతృవియోగం

Update: 2019-02-04 05:42 GMT

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మాతృ వియోగం కలిగింది. బాలు తల్లి శకుంతలమ్మ ఇవాళ ఉదయం 7.10గంటలకు తుది శ్వాస విడిచారు. నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలో నివాసముంటున్న ఆమె కొంతకాలంగా వయోభారం, కొద్దిపాటి అనారోగ్యంతో బాధపడుతున్నారు. తల్లి మరణవార్త సమాచారం అందుకున్న బాలు లండన్‌ నుంచి నెల్లూరు బయల్దేరారు. బాలసుబ్రహ్మణ్యం సోదరి శైలజ నిన్నే నెల్లూరు వచ్చారు. తల్లి తనను చూస్తూ కన్నుమూయడంతో శైలజ కన్నీటి పర్యంతమయ్యారు. 

Similar News