తల్లితండ్రులను పట్టించుకోని ఈ లోకంలో ఓ అల్లుడు అన్ని తానై చూసుకుంటున్నాడు .. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీనగర్లో కొన్నేళ్లుగా అక్కడే నివసిస్తున్న ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మంచాన పడింది. దీంతో ఆమె నివసిస్తున్న గుడిసెకు హైటెక్ హంగులు అద్దాడు వృద్ధురాలి అల్లుడు. కూలర్, ఫ్యాన్ని ఏర్పాటు చేశాడు. అంతేనా.. ఓ ఏసీ కూడా ఏర్పాటు చేశాడు. దీంతో.. ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గుడిసెకు ఏసీ ఏర్పాటు చేయడాన్ని చూసిన కాలనీవాసులు ఆశర్యపోతున్నారు .. ఆమెపై అతడు చూపిస్తున్న ఆదరణకు మంత్రముగ్దులు అవుతున్నారు ..