లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా సంతోశ్ గాంగ్వర్

Update: 2019-05-27 09:36 GMT

17 వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ సీనియర్ ఎంపీ సంతోశ్ గాంగ్వర్ ఎంపికయ్యారు. స్వతంత్ర హోదాలో కార్మిక శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆయన కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయించడంతో పాటు స్పీకర్‌ ఎన్నిక జరిగే వరకు సభను నిర్వహిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యుడిని నియమించే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అదే సంప్రదాయాన్ని బీజేపీ సైతం కొనసాగిస్తోంది.  

Similar News