గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి బరిలోకి దిగుతున్న రేవంత్ మిత్ర పక్షాల మద్దతు కూడగడుతున్నారు. నిన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో భేటి అయిన ఆయన కొద్ది సేపటి క్రితం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్తో సమావేశమయ్యారు. ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలంటూ కోరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..గతంలో యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్కు ఐటీఐఆర్ ప్రకటించింది. విభజన చట్టంలోనూ రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను కాంగ్రెస్ పొందుపర్చింది. హామీలన్నీ రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అని రేవంత్ అన్నారు.