కశ్మీర్ లో జవాన్లపై ఉగ్రవాదుల దాడిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. అమరవీరులైన సైనికుల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలిపారు. కశ్మీర్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఈ నెల 17న తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోరాదని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా తన బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించరాదని కోరారు. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ తనయుడు కేటీఆర్ ట్విట్టర్లో తెలియజేస్తూ.. 'ఇది కేసీఆర్ గారి రిక్వెస్ట్.. అందరూ పాటించాలి' అని కోరారు. వేడుకలకు బదులు రక్త దానం, అవయవ దానం, మొక్కలు నాటడం వంటి సమాజహిత కార్యక్రమాలను జరపాలని సూచించారు.
In light of the horrific terrorist attack on our armed forces in Kashmir, Hon'ble CM KCR Garu has requested party cadre to call off all celebrations on his birthday on 17th 🙏
— KTR (@KTRTRS) February 15, 2019
Please respect his request & instead of celebrations, promote blood/organ donation, plantation etc