పామును చేతిలో పట్టుకున్న ప్రియాంకగాంధీ

Update: 2019-05-02 09:13 GMT

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తూర్పు ఉత్తరప్రదేశ్‌ ఇన్‌చార్జి ప్రియాంకా గాంధీ పాములతో ఆడుకుంటున్నారు. ప్రచారంలో మునిగి తేలుతున్నారు. యూపీపై స్పెషల్‌ ఫోకస్‌ చేసిన ఆమె సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా రాయ్‌ బరేలీలో ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంకగాంధీ అక్కడ పాములు పట్టే వాళ్లతో ముచ్చటించారు. వారి జీవనవిధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఏ మాత్రం భయపడకుండా పాములను పట్టుకుని పరిశీలించారు. దీంతో అక్కడున్న వారంతా ప్రియాంక ధేర్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.



  

Similar News