కాసేపట్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

Update: 2019-06-20 04:45 GMT

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఉభయ సభలకు చెందిన సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ప్రసంగించనున్నారు. ఎన్డీఏ భవిష్యత్ ప్రణాళికలను వివరించనున్నారు కోవింద్. రేపు మరియు వచ్చే సోమ, మంగళవారాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై లోక్‌సభలో చర్చ జరగనుంది. ఇవాళ సాయంత్రం పార్లమెంట్‌ సభ్యులకు అశోక్‌ హోటల్‌లో ప్రధాని విందు ఇవ్వనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా... తొలిసారిగా పార్లమెంట్‌ సభ్యులకు విందు ఇస్తున్నారు.  

Full View

Tags:    

Similar News