శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు...నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిని బుజ్జగిస్తున్న...

Update: 2019-03-26 06:09 GMT

నామినేషన్ల ముగింపుతో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీ,వై.రెడ్డిని అతని కుటుంబ సభ్యులను టీడీపీ అధిష్టానం బుజ్దగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నంద్యాల, బనగానపల్లి, శ్రీశైలం నియోజకవర్గాల నుంచి జనసేన తరపున ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే రెండు దఫాలుగా ఎస్పీవై రెడ్డితో టీడీపీ నేతలు చర్చించారు. మనస్సు మార్చుకొని సీఎం చంద్రబాబు పర్యటనకు హజరయ్యేలా ఒత్తిడి తెస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.  

Similar News