అగ్రవర్ణాల పేదలకు గుడ్న్యూస్...మోడీ సర్కార్ సంచలన నిర్ణయం
ఎన్నికల ముంగిట మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయించింది.
ఎన్నికల ముంగిట మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్ వర్తింపు చేయాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి చేరే అవకాశం ఉంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును రేపు కేంద్రం పార్లమెంట్ ముందు పెట్టే అవకాశం ఉంది. చాలా కాలంగా ఈ డిమాండ్ ఉండగా ఎన్నికలకు ముందే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు కోసం రేపటితో ముగియనున్న పార్లమెంట్ సమావేశాలను రెండు రోజులపాటు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.