జనసేన ఓడిపోయినా నైతికంగా గెలిచింది .. నాగబాబు

Update: 2019-05-26 02:55 GMT

నా ఛానల్ నా ఇష్టం పేరుతో సినేనటుడు నాగబాబు ఓ యుట్యుబ్ ఛానల్ పెట్టిన సంగతి పెట్టిన సంగతి తెలిసిందే .. అయితే ఎన్నికలు ముగిసిన తరవాత మళ్లీ అయన లైవ్ లోకి వచ్చి మాట్లడారు .. ఏపీ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి శుబాకాంక్షలు అందజేసారు .. నవరత్నాలు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ ఐదేళ్లలో జగన్‌ నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. తమ సహకారం జగన్‌కు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ఇక ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా జనసేన గురించి అయన మాట్లాడారు .. జనసేన గెలుపుకోసం పనిచేసిన జనసైనికులకు అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. క్లీన్‌ పాలిటిక్స్‌తో రాజకీయాల్లోకి వచ్చామని. జనసేనకు కొన్ని లక్షల ఓట్లు వచ్చాయని.. లక్షలాది మంది ప్రజలు క్లీన్‌ పాలిటిక్స్‌ పట్ల ఇష్టంతో ఉన్నారని చెప్పారు.

మార్పు కోరే ప్రజలందరికీ జనసేన తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన ఎన్నికల్లో ఓడిపోయినా.. నైతికంగా మాత్రం విజయం సాధించిందన్నారు. కచ్చితంగా మంచి మార్పు తీసుకొద్దామని జనసైనికులను ఉద్దేశించి నాగబాబు అన్నారు. 

Similar News