శ్రీకాకుళం జిల్లా రాజాంలో దారుణం జరిగింది. ఓ తల్లి కూతురిని వంట నేర్చుకోమని మందలించింది. అంతే దాంతో తీవ్ర మనస్థాపం చెందిన కూతురు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాజాంలోని కొండక వీధిలో నివాసముంటున్న మంగమ్మ అనే మహిళ స్థానికంగా టిఫిన్ షాపు నడుపుతూ కూతురిని చదివిస్తోంది. అయితే వేసవి సెలవలు కదా అని కూతురిని వంట నేర్చుకోమని మందలించింది. ఆ మాటలను అవమానంగా భావించిన విద్యార్థిని పెట్రోల్ కొనుక్కొని, ఊరి శివారులోని పొలంలో ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. 90 శాతం కాలిన గాయాలతో విషమ పరిస్థితిలో ఉన్న బాలిక రాజాం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.