ఏపీలో పొలింగ్ దగ్గరపడుతోంది. ఇప్పటికే పార్టీ అధినేతలు ఎవరి వారే యమునాతీరే అన్నట్లు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, సినీ నటుడు మోహన్బాబు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించాడు. వైసీపీ చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తరపున మోహన్బాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఏపీ ప్రజల సొమ్ము నారా చంద్రబాబు దోచుకొని ఆ డబ్బునంతా తన కొడుకు అకౌంట్లో వేసుకుని నికృష్టంగా వ్యవహరిస్తున్నారని మోహన్ బాబు ఆరోపించారు.
చంద్రబాబు మోసగాడు కాబట్టే టీడీపీ పార్టీ ఇకపై కనుమరుగువుతందని అన్నారు. తాను దాదాపు తొమ్మిది జిల్లాల్లో ప్రచారం చేశానని ఇందులో భాగంగా వైసీపీకి 130 సీట్లు వస్తాయనే విషయాన్ని గమనించారన్నారు. కాబోయే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అధికారం చేపట్టగానే ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా మంచివారని కాబట్టి ఫ్యాను గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మోహన్బాబు ప్రజలను కోరారు.