అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే టీడీపీకి షాక్ తగిలేలా ఉంది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీడీపీకి దూరంగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలతో కలిసి అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. అయితే, సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సండ్ర వెంకట వీరయ్య మాత్రం ఎన్టీఆర్ ఘాట్కు రాకపోవడంపై టీడీపీలో కలకలం రేగింది. పార్టీ మారుతారన్న ప్రచారం నేపథ్యంలో సండ్ర టీడీపీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.