ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. తిరుమలలో శ్రీవారిని రోజా దర్శించుకున్నారు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. పుల్వామా ఘటనపై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు అని వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ రాజీనామా చేయాలనడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. పుష్కరాల్లో 30 మంది చనిపోతే చంద్రబాబు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు.