మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. చిక్కడపల్లి సాయికృప హోటల్లో ఓ ఫంక్షన్కు ఎమ్మెల్యే హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్లిపోయేందుకు ఆయన లిఫ్ట్ ఎక్కారు ఐతే సాంకేతిక లోపంతో మొదటి నుంచి ఒక్కసారిగా లిఫ్ట్ పడిపోవడంతో హనుమంతరావు కాలికి స్వల్పగాయమైంది. చికిత్స నిమిత్తం యశోద ఆస్పత్రికి తరలించారు. మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రికి విచ్చేసి ఎమ్మెల్యేని పరామర్శించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.