జగన్ పై గంటా ఫైర్ ..

Update: 2019-06-01 05:50 GMT

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని విమర్శించారు గంటా శ్రీనివాస్ రావు .. నూతన భాద్యతలు చేపట్టిన ఆయనకు అభినందనలు తెలిపేందుకు గత రెండు రోజులనుండి ప్రయత్నించినా అయన కలిసే అవకాశం లభించలేదని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. జగన్ ను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు తనతో పాటు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడును పార్టీ హైకమాండ్ నియమించిందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన నవరత్నాల హామీలను నుంచి తప్పించుకునేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ప్రత్యేక హోదాపై జగన్ స్పష్టంగా ప్రధాని మోదీతో మాట్లాడలేకపోతున్నారని డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారని అయన అన్నారు. పెన్షన్ ను రూ. 3వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని రూ. 250 మాత్రమే పెంచి, రూ. 2,250కి పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. మద్య నిషేధంపై కూడా మాట తప్పారని దుయ్యబట్టారు. గెలుపు, ఓటమిలు టీడీపీకి కొత్త కాదని తిరిగి ప్రజల మద్దతును పొందుతామని అయన ఆశాభావం వ్యక్జ్తం చేసారు .. 

Similar News