టీఆర్ఎస్ చెల్లని పైసా అన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రోజుకో మాట పూటకో సవాల్ చేయడం కాంగ్రెస్ నేతల నైజమన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇలాగే సవాళ్లు చేసి తోక ముడవలేదా ? అంటూ ప్రశ్నించారు. నల్లగొండ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ చెల్లని రూపాయిని బరిలోకి దింపిందంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు ఆదరిస్తుంటే కాంగ్రెస్ నేతల గుండెల్లో వణుకు పడుతోందని జగదీష్ రెడ్డి ఎద్దేవా ఆరోపించారు.