ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో బీజేపీ జోష్ లో ఉంది. కమలం కార్యకర్తలు, నేతలు ముందస్తు సంబురాల్లో మునిగిపోయారు. రిజల్ట్స్ వచ్చే కంటే ముందే టపాసులు, స్వీట్లు రెడీ చేసుకుంటున్నారు. మహారాష్ర్ట బీజేపీ నేతల నుంచి భారీ మొత్తంలో ఆర్డర్లు రావడంతో ముంబై స్వీట్ వాలాలు పనుల్లో పడ్డారు. స్వీట్ షాప్స్ కార్మికులు కమలం నేతలను ఆకట్టుకునేందుకు మోడీ మాస్కులతో స్వీట్లు తయారు చేస్తున్నారు.