సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో విడుత పోలింగ్ జరుగుతున్న సమయంలో ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఒరిస్సాలోని కందమాల్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ రెచ్చిపోయారు. పోలింగ్ సిబ్బంది లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సంజుక్తా అనే పోలింగ్ ఏజెంట్ ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కంధమాల్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ విస్తృతం చేశారు. ఎదురుపడిన మావోయిస్టులపై భారీగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందగా ఓ మహిళా మావోయిస్టుకు గాయాలైనట్టు తెలుస్తోంది.