రాజమహేంద్రవరం టీడీపీ ఎంపీ అభ్యర్థి, మురళీ మోహన్ కోడలు మాగంటి రూపాదేవి రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ఆమె కుమార్తెకు కూడా స్వల్పగాయాలయ్యాయి. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో రూపాదేవికి , ఆమె కూతురికి గాయాలైనట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన రూపా కొద్ది సేపటి తర్వాత డిశ్చార్జ్ అయినట్టు సమాచారం.