పదవులు ఆశించి వైసీపీలో చేరడం లేదు: కిల్లి కృపారాణి

Update: 2019-02-19 10:20 GMT

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరనున్నారు. తన భర్త రామ్మోహన్‌రావుతో కలిసి హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌ను ఆమె కలిశారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే జగన్‌ ఆలోచనల పట్ల ఆకర్షితురాలినై వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈనెల 28న అమరావతిలో జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు కిల్లి కృపారాణి స్పష్టం చేశారు.

తాను పదవులేమీ ఆశించి వైసీపీలో చేరడం లేదని జగన్‌ నాయకత్వాన్ని బలపరిచేందుకు తన వంతు కృషిచేస్తానని కిల్లి కృపారాణి చెప్పారు. ఈ ఉదయమే కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు. 2009 ఎన్నికల్లో కృపారాణి శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ ఎంపీగా విజయం సాధించారు. అనంతరం యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు. 




 


Similar News