మేమంతా మమత బెనర్జీ వెంటే ఉన్నాం: కేజ్రీవాల్

Update: 2019-05-16 10:25 GMT

కోల్‌కత్తాలో అమిత్‌ షా రోడ్‌ షో సందర్భంగా జరిగిన విధ్వంసాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. తామంతా మమత బెనర్జీ వెంటే ఉన్నామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్ ప్రజలు మోడీకి, అమిత్‌ షాకు ధీటైన జవాబు చెబుతారని తాను ఆశిస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికల సంఘం పనితీరును కూడా కేజ్రీవాల్ తప్పుబట్టారు. మోడీ సభలకు ఎటువంటి ఆంక్షలు విధించకుండా ఇతరుల సభలకు మాత్రం ఆటంకం కలిగించడాన్ని కేజ్రీవాల్ ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఇటువంటి ఎన్నికల సంఘాన్ని తాను చూడలేదని ఈసీని విమర్శించారు. 

Similar News