మన్మధుడు సినిమాకి సీక్వెల్ గా మన్మధుడు 2 పార్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే .. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది . రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు . ఈ చిత్రాన్ని మనం ఎంటర్ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి . అయితే అ పాత్ర కోసం పలువురు హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి . అందులో కీర్తి సురేష్ ఒకరు .. మహానటి సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ఈ భామకి ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా నాగ్ సరసన చోటు సంపాదించుకుంది . సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న సన్నివేశాలలోని ఓ ఫోటోను చిత్రబృందం అధికారకంగా విడుదల చేసింది . ఇందులో నాగ్ ఒడిలో కీర్తి ఒదిగిపోయింది ..