మార్పు కోసమే నేను జనసేనను స్థాపించా: పవన్‌

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడుపెంచాడు. కడప జిల్లా నేతలతో నేడు పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.

Update: 2019-01-10 09:41 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడుపెంచాడు. కడప జిల్లా నేతలతో నేడు పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కేవలం మార్పు కోసమే మాత్రమే జనసేన పార్టీని స్థాపించానని జనసేనే అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజారాజ్యం పార్టీ రాకముందే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టానని, గత 2003 సంవత్సరంలోనే తాను రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం డబ్బు ప్రభావిత రాజకీయాలు పెరిగాయని, అందుకే ఆ నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ప్రధాని మోడీని సపొర్ట్ చేశానని పవన్ తెలిపారు.

Similar News