విడుదలైన ఇంటర్ రివాల్యుయేషన్ ఫలితాల్లోనూ తాను అనుకున్న మార్కులు రాలేదన్న మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇక వివరాల్లోకి వెళితే ఈ సంఘటన హైదరాబాద్, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది . మానస ఓ ప్రముఖ కాలేజిలో ఇంటర్ చదువుతోంది. ఫలితాల్లో ఆమెకు తాననుకున్న మార్కులు రాలేదు. ఆపై ఇటీవలి రివాల్యుయేషన్ లోనూ మార్కులు పెరగలేదు. దీంతో ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గుర్తించిన మానస కుటుంబీకులు, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మానస ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు.