ఇంటర్ విద్యార్థుల రీవెరిఫికేషన్ ఫలితాలు వెల్లడి...ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఇంటర్ విద్యార్థుల రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. పాసైన విద్యార్థుల రీవెరిఫికేషన్ ఫలితాలను ఇంటర్బోర్డు ప్రకటించింది. మార్చి పరీక్షల్లో ఉత్తీర్ణులై పునఃపరిశీలన, పునఃలెక్కింపు కోసం దరఖాస్తు చేసుకున్న వారి జవాబు పత్రాలను శుక్రవారం ఆన్లైన్లో ఉంచినట్టు ఇంటర్బోర్డు వెల్లడించింది. తమ వెబ్సైట్ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. మరో 8వేల జవాబు పత్రాలను అప్లోడ్ చేసే ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని తెలిపింది.