హైదరాబాద్ సనత్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. స్నేహపురి కాలనీలో వెంకటేష్ అనే వ్యాపారి నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి బయట నడిరొడ్డుపై చుట్టుపక్కల వారు చూస్తుండగానే ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్ధానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా ఆపేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంపై తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆత్మహత్య దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.