మండు టెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాదీలకు శనివారం సాయంత్రం కొంత ఉపశమనం లభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి భగభగలతో మగ్గిపోయిన నగరవాసులను చిరుజల్లులు శాంతింపజేశాయి. శనివారం సాయంత్రం హైదరాబాద్తోపాటు తెలంగాణలో పలుచోట్ల చిరు జల్లులు కురవడంతో వేసవి తాపం నుంచి ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మధ్నాహ్నం తీవ్ర ఎండ తర్వాత ఒక్కసారిగా ఈదురు గాలులు వీచాయి. తర్వాత పలుచోట్ల ఓ మాదిరి భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీరు పారుతుండడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.