ఇది చారిత్రాత్మక తీర్పు : ఉమ్మారెడ్డి

Update: 2019-05-23 07:23 GMT

రాష్ట్ర రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లికించబడిన రోజని వైసీపి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అమరావతిలో అయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారన్నారు. ఎగ్జిట్ పోల్ సర్వే లో వైసీపీ గెలుస్తుంది అంటే అపహాస్యం చేశారు. నలభై ఏళ్ల సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు కి ప్రజల నాడి అందలేదాని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. మహిళలు నాకు ఓటు వేశారని చంద్రబాబు అవగాహన రహిత్యాన్ని బయట పెట్టుకున్నారని అయన అన్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని మహిళలు తిరస్కరించారన్నారు. మేచంద్రబాబు ఈ రోజు ఢిల్లీ కి వెళితే జాతీయ పార్టీలు ఎదురు తిరుగుతాయని చెప్పారు. చంద్రబాబు ఆయనకు ఆయనే పాతాళానికి తొక్కుకున్నాడు. లోకేష్ ని మంత్రి చేశావ్....ఆయన మంగళగిరిలో ఒడిపోతున్నాడు, బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ళు మొదటిసారే ఒడిపోతున్నారు అంటూ చురకలంటించారు. Ys లా సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు అందించాలి అని జగన్ కోరిక. రాజకీయాల్లో ఇలాంటి నిశ్శబ్ద విప్లవం మళ్ళీ రాదు. 30 తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు

Similar News