మే 8లోగా రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌..!

Update: 2019-04-29 10:50 GMT

తెలంగాణ ఇంటర్ బోర్డ్ వ్యవహారంపై హైకోర్ట్‌లో వాదనలు ముగిశాయి. హైకోర్టుకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.ఇప్పటికే ఫెయిల్ అయిన 3 లక్షల మంది విద్యార్థులకు మళ్ళీ రీ- వెరిఫికేషన్, రీ-కౌంటింగ్‌కు జరుపుతామని కోర్టుకు ఇంటర్ బోర్డ్ తెలిపింది. రీ వేరిఫికేషన్ కాదు రీ-వాల్యుయేషన్ జరిపించాలని కోర్టును పిటిషనర్ తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి కోరారు. ఇంటర్ బోర్డ్ ఫలితాలపై ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను మేము చూసామని హైకోర్టు స్పష్టం చేసింది. రీ- వెరిఫికేషన్, రీ- కౌంటింగ్‌ను మే-08 లోపు ముగించి పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వివరాలు చూసిన తరువాత 8 వ తేదీ మధ్యాహ్నం పిటీషన్‌ను హైకోర్ట్ విచారిస్తామని తెలిపింది. తదుపరి విచారణను మే- 8కు వాయిదా వేయడం జరిగింది.

Similar News