జగన్ పై దాడి కేసు...విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిన హర్షవర్ధన్
జగన్పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నిందితుడు శ్రీనివాసరావు పని చేసిన రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్కు ఇప్పటికే నోటీసులిచ్చిన ఎన్ఐఏ విచారణకు హాజరుకాకపోవడంతో ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, ఇల్లు, కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో ఎన్ఐఏ అధికారులు వెనుదిరిగారు.