ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనం వీస్తోందన్నారు గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గురువారం వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా ఆర్డీఓ ఆఫీసుకు వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధిస్తుందని చెప్పారు. వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేన అంతర్గత ఒప్పందంతో పనిచేస్తున్నాయని, ఈ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు గోపిరెడ్డి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో ఫ్యాన్ గాలీ వీస్తుందని, తప్పకుండా ప్రజలు వైసీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.