ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే డెల్లా గాడ్ఫ్రే(62) ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న ఆమె అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఏపీ శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా నామినేట్ అయ్యారు. 2004 వరకు శాసనసభ్యురాలిగా కొనసాగారు. డెల్లా గాడ్ఫ్రే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఆంగ్లో ఇండియన్ల సంక్షేమమే కాక అందరి సంక్షేమానికి పాటుపడి డెల్లా ఎంతో పేరుగాంచారు. కాగా డెల్లా గాడ్ఫ్రే మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. గాడ్ ఫ్రే కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేపు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్లోని సెయింట్ జోసెఫ్ కెథడ్రాల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.