వైసీపీ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి

అనంతపురం టీడీపీ మాజీ శాసనసభ్యులు గురునాథ్ రెడ్డి ఎట్టకేలకు సోమవారం వైసీపీ గూటికి చేకుకున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమ‍క్షంలో పార్టీ కండువా కప్పుకోని వైయస్సార్ సీపీలో చేరారు.

Update: 2018-12-31 12:53 GMT

అనంతపురం టీడీపీ మాజీ శాసనసభ్యులు గురునాథ్ రెడ్డి ఎట్టకేలకు సోమవారం వైసీపీ గూటికి చేకుకున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమ‍క్షంలో పార్టీ కండువా కప్పుకోని వైయస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్బంగా గురునాథ్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పాలన వచ్చిన దగ్గరినుండి కేవలం తన కుటుంబసభ్యులు మాత్రమే సంతోషంగా ఉన్నారని ఏపీ ప్రజలు ఏవరు సంతోషంగా లేరని అన్నారు. ఇక ప్రత్యేకహోదా గురించి మాట్లాడు మొదటినుంచి కూడా ప్రత్యేకహోదాకోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుంటే సీఎం చంద్రబాబు మాత్రం పూటకో మాట మార్చారని మండిపడ్డారు. గత నాలుగేండ్లుగా దోచుకోవడం తప్ప రాష్ట్రాభివృద్ధికి బాబు చేసిందేమీ లేదని అన్నారు. 

Similar News