విమానాలకు భోగి మంటల పొగ అంతరాయంగా మారింది. మంచుకు భోగి మంటల పొగ తోడు కావడంతో రేణిగుంట విమానాశ్రయంలో విజుబులిటీ లెవెల్స్ పడిపోయాయి. పొగ మంచు కారణంగా ఉదయం 7గంటలకు ల్యాండ్ కావాల్సిన మూడు విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. ఇండియన్ ఎయిర్ లైన్స్, స్పైస్ జెట్, ట్రూజెట్ విమానాలు రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉండగా విజుబులిటీ లేకపోవడంతో ఏటీసీ అధికారులు ల్యాండింగ్కు అనుమతివ్వలేదు. హైదరాబాద్ నుంచి వచ్చిన స్పైస్ జెట్ విమానంలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు.