బావిలో ఈతకు వెళ్లి ఐదుగురు బాలికలు మృతి

Update: 2019-04-08 15:00 GMT

జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మల్దకల్‌ మండలం నాగర్‌దొడ్డి గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడి ఐదుగురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 10 యేళ్ల లోపు వారే కావడం అందులో నలుగురు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఘటనపై కేసు నోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News