తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని మలికిపురంలో పద్మజ థియేటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడటంతో ఫర్నీచర్ ధ్వంసమైంది. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే ప్రమాద సమయంలో థియేటర్ ఖాళీగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. థియేటర్లోని ఫర్నీచర్ అగ్నికి అహుతి అవ్వగా పై కప్పు పూర్తిగా కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దాదాపు కోటి రూపాయల ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.