నారా లోకేశ్‌కు ఓటమి భయం ? ఓ పత్రిక సంచలన కథనం

Update: 2019-05-05 07:51 GMT

ఏపీ రాజకీయాలు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్నాయి. అందుకే ఇతర రాష్ట్రాల పత్రికలు సైతం ఏపీలో రాజకీయ పరిణామలపై కథనాలు రాస్తున్నాయి. ఏపీలో మొన్నటి వరకు తమదే అధికారం తండ్రే రాష్ట్రానికే ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే లోకేశ్ గెలుపు ఓటమిలపై ఇప్పటికే బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఓ పత్రిక "దిన మలర్‌" అనే తమిళ దినపత్రిక ఆదిలోనే హంసపాదా? అంటూ శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది.నారా లోకేష్‌కు మంగళగిరిలో ఓడిపోతానన్న భయం ఉందనేది ఈ కథనం సారాంశం.

లోకేశ్‌కు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదేమో నన్న భయం ఉందని మంత్రిగా ఉండి కూడా గెలుస్తానన్న ధైర్యం ఆయనలో లేదని పత్రిక రాసింది. నేను ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు ఇవి ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆదిలోనే హంసపాదు అనే ముద్ర పడిపోతుంది అనే భీతిని ఎదుర్కొంటున్నాడు అని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో తమిళ పత్రికలో లోకేష్ గెలుపుపై ఇలాంటి కథనాలు ప్రచురించడం మరోసారి ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

Similar News