ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ అనిల్ చంద్ర పునేతా రేపు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ప్రస్తుతం ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అనిల్ చంద్ర పునేతా 1984 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ పునేఠాను సీఎస్ పదవి నుంచి తప్పించింది. అటు తర్వాత సీఎస్గా బాధ్యతలు చేపట్టిన ఎల్వీ సుబ్రహ్మణ్యం పునేఠాకు ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.