దేశవ్యాప్తంగా ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌

Update: 2019-04-11 01:39 GMT

దేశవ్యాప్తంగా తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 20 రాష్ట్రాల్లోని 91 లోక్‌సభ స్థానాలతోపాటు పలుచోట్ల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలు, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది. నిజామాబాద్‌ లోక్‌సభ బరిలో అత్యధికంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓట్లేసేందుకు జనం భారీగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

Similar News