ఖమ్మంలో కాంగ్రెస్ ఖాళీ.. టీఆర్ఎస్‌లోకి కొత్తగూడెం ఎమ్మెల్యే?

Update: 2019-03-15 08:11 GMT

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌తో కొత్తగూడెం కాంగ్రెస్‌ శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు భేటి అయ్యారు. కుమారులతో కలిసి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. వనమా పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారంటూ ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలు కాంగ్రెస్‌లో తీవ్ర కల్లోలం రేపుతున్నాయి. 

Similar News